డార్జిలింగ్: గూర్ఖాలకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా తన రక్తంతో లేఖ రాశారు. పర్వత ప్రాంతాల్లోని 11 గూర్ఖా జాతులకు శాశ్వత రాజకీయ పరిష్కారంలో భాగంగా షెడ్యూల్ గిరిజన హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
‘నేను తీసుకొన్న నిర్ణయం కొందరికి అసాధారణమనిపించవచ్చు. కానీ తీవ్రమైన సమస్య పరిష్కారం కోరుతూ నా రక్తంతో ప్రధాని మోదీకి లేఖ రాయాల్సి వచ్చింది. గూర్ఖాల కలే నా కల. గత పదేండ్లుగా బీజేపీ ఇచ్చిన హామీల్లో షెడ్యూల్ హోదా ప్రస్తావన ఉన్నా దాన్ని నెరవేర్చలేదు’ అని ఆయన పేర్కొన్నారు.