ముంబై: ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. ఇది చూసిన ఆ వ్యక్తి తల్లి ఎంతో ధైర్యంగా ప్రతిఘటించింది. కుమారుడ్ని కాపాడేందుకు రాయితో దుండగులను తరిమింది. (Mother Chases Man With Stone) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఈ సంఘటన జరిగింది. సోమవారం జైసింగ్పూర్లోని షావు నగర్ ప్రాంతంలో జిరాక్స్ షాపు వద్ద ఒక వ్యక్తి స్కూటర్పై కూర్చొని ఉన్నాడు. పక్కనే నిల్చొని ఉన్న తల్లితో అతడు మాట్లాడుతున్నాడు.
ఇంతలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై అక్కడకు చేరుకున్నారు. ఒక దుండగుడి చేతిలో కత్తి ఉంది. తల్లితో మాట్లాడుతున్న వ్యక్తిపై కత్తితో దాడి చేసేందుకు అతడు ప్రయత్నించాడు.
కాగా, గమనించిన ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఇది చూసి అతడి తల్లి కూడా షాక్ అయ్యింది. అయితే వారిద్దరూ వెంటనే తేరుకున్నారు. ఆ మహిళ చేతిలోకి రాయి తీసుకుని కత్తితో దాడి చేసిన వ్యక్తి వెనుక పరుగెత్తింది. ఆమె కుమారుడు కూడా వారి వెంటపడ్డాడు. దీంతో దుండగులు స్కూటర్పై అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A Man attacked the son, the mother ran after him with a stone in her hand, Mother chased away the goon for her son while risking her Own Life🫡, Kolhapur Maharashtra
pic.twitter.com/9DPnKNA3gC— Ghar Ke Kalesh (@gharkekalesh) August 19, 2024