జైపూర్, ఏప్రిల్ 8: రాజస్థాన్లో దారుణం జరిగింది. బార్మర్ జిల్లాలో 30 ఏండ్ల దళిత మహిళ ఇంట్లోకి చొరబడ్డ ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడి, అనంతరం నిప్పుపెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ జోధ్పూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అదే గ్రామానికి చెందిన నిందితుడు షాకూర్ఖాన్పై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని జోధ్పూర్ పోలీసులు శనివారం తెలిపారు.
గురువారం దళిత మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన షాకూర్ చొరబడ్డాడు. లైంగికదాడికి పాల్పడి, పారిపోతూ యాసిడ్ వంటి ఒక రసాయన ద్రావణాన్ని పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో 50 శాతానికిపైగా ఆమె శరీరం కాలిపోయింది. జోధ్పూర్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.