బెంగుళూరు: ఓ దళిత మహిళ నీళ్లు తాగినందుకు.. ట్యాంకర్ను గోమాత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హెగ్గొతార గ్రామంలో జరిగింది. ట్యాప్ ద్వారా ఆ దళిత మహిళ నీళ్లు తాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో ఉండే ఉన్నత కులాలకు చెందిన వాళ్లు ఆ ట్యాంక్ను గోమూత్రంతో కడిగినట్లు తెలుస్తోంది.
ట్యాంక్లో ఉన్న నీటిని ఖాళీ చేయించి దాన్ని శుభ్రం చేశారు. ట్యాంక్ను శుభ్రం చేసింది నిజమే కానీ, దాన్ని గోమూత్రంతో కడిగారా లేదా అన్న విషయం తనకు తెలియదని స్థానిక తహసిల్లాదర్ బసవరాజ్ తెలిపారు. కానీ ఆ ట్యాంక్ వద్ద నీళ్లు తాగిన మహిళను ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదన్నారు.
ఆ మహిళను గుర్తించిన తర్వాత కేసు బుక్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. గ్రామంలో చాలా ట్యాంక్లు ఉన్నాయని, అందరూ నీళ్లు తాగవచ్చు అని ఆ ట్యాంక్లపై రాసి ఉంటుందని ఆయన తెలిపారు.