కోజికోడ్: కేరళలోని కాలికట్ ఎన్ఐటీ కాలేజీ(NIT College)ని మూడు రోజుల పాటు మూసివేశారు.కాలేజీ క్యాంపస్లో ఆందోళనలు చెలరేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దళిత విద్యార్థి వ్యాసక్ ప్రేమ్కుమార్ను సస్పెండ్ చేయడం వల్ల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఆ విద్యార్థిపై సస్పెన్షన్ను హోల్డ్లో పెట్టారు. కానీ శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే పరీక్షలు, ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలను రద్దు చేశారు. హాస్టల్ గదుల్లోనే విద్యార్థులు ఉండాలని ఎన్ఐటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు.
జనవరి 22వ తేదీన అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో కాలేజీలో ఆ ఈవెంట్కు వ్యతిరేకంగా ప్రేమ్కుమార్ ప్లకార్డులను ప్రదర్శించాడు. అయితే ఆ ఘటన నేపథ్యంలో ఆ విద్యార్థిపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారు. దీంతో విద్యార్థులు అప్పటి నుంచి క్యాంపస్లో ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ, కేఎస్యూ లాంటి విద్యా సంఘాలు నిరసనల్లో పాల్గొన్నాయి. ఓ దశలో పోలీసులు కూడా విద్యార్థుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు.