బుదౌన్(యూపీ): బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దళితులపై వరుస దాడులు జరగడం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా పబ్లిక్ నల్లా నీళ్లు తాగాడని కమలేష్(24) అనే దళిత యువకుడిని కొందరు కట్టెలతో కొట్టి చంపారు. పోలీసుల కథనం ప్రకారం సోమవారం రాత్రి సాత్రా గ్రామంలోని పబ్లిక్ నల్లాలో నీళ్లు తాగాడని కమలేష్పై సూరజ్ రాథోడ్ అతడి సహచరులు దాడి చేశారు. వెంటనే బాధితుడిని దవాఖానకు తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.