న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత ఐదు రోజులుగా నిత్యం 3లక్షలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. రోజువారీ పాజిటివీ రేటు 20శాతానికి మంచిపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలు కీలక సమాచారాన్ని అందించాయి. ఫిబ్రవరి 15 తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లోని మెట్రోనగరాల్లో కేసుల తగ్గడం మొదలైందని పేర్కొన్నాయి.
టీకాలు వేయడంతో మూడో దశలో ప్రభావం తగ్గిందని పేర్కొన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేస్తోందని, ఇప్పటి వరకు వయోజన జనాభాలో 74శాతం పూర్తిగా టీకాలు వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో సోమవారం రోజువారీ కొవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,06,064 కేసులు రికార్డవగా.. రోజువారీ కొవిడ్ పాటివిటీ రేటు 20శాతానికిపైగా నమోదైంది.