టాటా గ్రూప్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన కారు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. సైరస్ మిస్త్రీ, మరో ముగ్గురితో కలిసి గుజరాత్ నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా పట్టపగలు ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఆకస్మిక మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అగ్ర రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు సంతాపం తెలిపారు. కాగా, ఆయన సాదాసీదా జీవితాన్ని ఇష్టపడతారని తెలిపే ఒక ఫొటో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఫొటోను ‘జొరాస్ట్రియన్స్ ఇన్ హైదరాబాద్’ అనే ఫేస్బుక్ పేజీలో షేర్ చేశారు. ఇందులో సైరస్ మిస్త్రీ తన డ్రైవర్తో కలిసి ఓ దాబాలో భోజనం చేస్తున్నాడు. మంచంపై డ్రైవర్కు ఎదురుగా కూర్చుని భోజనాన్ని ఆస్వాదిస్తున్నాడు. ‘సైరస్ మిస్త్రీ వినయం చూడండి..అతను అంతకుముందు రోడ్డు ప్రయాణంలో స్థానిక దాబాలో తన డ్రైవర్తో కలిసి సాధారణ భోజనాన్ని ఆస్వాదిస్తున్నాడు. అవును అతను విమాన ప్రయాణాల కంటే రోడ్ ట్రిప్లు, స్ట్రీట్ ఫుడ్స్ను ఎక్కువగా ఇష్టపడతాడు’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోను ఎప్పుడు క్లిక్ చేశారో తెలుపలేదు. అయితే, చాలామంది నెటిజన్లు ఈ ఫొటోను మెహతో అనే ఫొటోగ్రాఫర్ 2016లో క్లిక్ చేశారని కామెంట్ చేశారు. ఈ ఫొటోను చాలామంది లైక్ చేశారు.