న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: సైబర్ నేరగాళ్లు భారత్లోని ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేసుకున్నారని ప్రభుత్వ సెక్యూరిటీ అడ్వయిజరీ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. టెలిగ్రామ్, చాట్జీపీటీ, ఒపేరా మినీ బ్రౌజర్, యూట్యూబ్(ప్రీమియం), ఇతర పాపులర్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా ‘డోజ్ర్యాట్’ అనే మాల్వేర్ను ప్రవేశపెట్టేందుకు సైబ ర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నది. యూజర్ల వ్యక్తిగత డాటా, ఫొటోలు, బ్యాంకింగ్ సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.