Cyber Attack | సుప్రీంకోర్టు వెబ్సైట్పై సైబర్ దాడి (ఫిషింగ్) జరిగిందని సర్వోన్నత న్యాయస్థారం గురువారం సర్క్యూలర్ జారీ చేసింది. రిజిస్ట్రీ వెబ్సైట్ మాదిరిగా ఉన్న డొమైన్తో ఫేక్ వెబ్సైట్ను క్రియేట్ చేశారని పేర్కొంది. దాంతో యూజర్ల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని కోరుతున్నారని పేర్కొంది. యూఆర్ఎల్ ఉన్న వెబ్సైట్లో యూజర్లు వ్యక్తిగత, రహస్య డేటాను పంచుకోవద్దని అడ్వైజరీ జారీ చేసింది. వ్యక్తిగత డేటాను ఇస్తే నేరగాళ్లు చోరీ చేసే అవకాశాలున్నాయని తెలిపింది. యూజర్లు అనుమానాస్పదంగా ఉండే లింక్లపై క్లిక్ చేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం కోరింది.
అసలైన వెబ్సైట్ అని ధ్రువీకరించిన తర్వాత అందులోకి వెళ్లాలని.. రిజిస్ట్రీ వ్యక్తిగత సమాచారం, ఆర్థిక వివరాలు, ఇతర సమాచారాన్ని ఎప్పుడూ కోరదని అడ్వైజరీలో తెలిపింది. సుప్రీంకోర్టుకు www.sci.gov.in అనే డొమైన్ ఉందని, వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసే సమయంలో యూఆర్ఎల్ను సరి చూసుకోవాలని సూచించింది. నకిలీ వెబ్సైట్ పట్ల న్యాయవాదులు, పిటిషనర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్టికల్ 370పై విచారణ సందర్భంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ హెచ్చరించారు. ఎవరైనా ఫిషింగ్ దాడికి గురైతే అన్ని బ్యాంకు ఖాతాల పిన్లు, పాస్వర్డ్లు మార్చుకోవాలని కోర్టు కోరింది. క్రెడిట్ కార్డులపై బ్యాంకులను సంప్రదించాలని సూచించింది. ఈ ఫిషింగ్ దాడిపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చర్యలు తీసుకుంటుందని చెప్పింది.