రిశికేష్, అక్టోబర్ 3: చెట్లను సంరక్షించాల్సిన అటవీ అధికారులే అక్రమంగా ఆరు వేల వృక్షాలను నేలకూల్చారు. ఉత్తరాఖండ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లోని కాలాగఢ్ ఫారెస్ట్ డివిజన్లో టైగర్ సఫారీ కోసం 6 వేలకు పైగా చెట్లను నరికివేసినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) నివేదికలో తెలిపింది.
టైగర్ సఫారీ ఏర్పాటుకు 163 చెట్ల నరికివేతకు మాత్రమే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తరాఖండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకున్నదని పేర్కొంది. కానీ, 16.21 హెక్టార్లలోని 6,093 చెట్లను నరికివేసినట్టు ఎఫ్ఎస్ఐ పేర్కొంది. అయితే, ఎఫ్ఎస్ఐ తప్పుగా సర్వే చేసిందని ఉత్తరాఖండ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ వినోద్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన రిపోర్ట్ను తాను ఉత్తరాఖండ్ సర్కారుతోపాటు ఎఫ్ఎస్ఐకి పంపించానని తెలిపారు.