Mumbai | ముంబయి ఎయిర్పోర్ట్లో కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. పలువురు వ్యక్తుల నుంచి 1.76 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బంగారం విలువ రూ.97లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. చెక్ఇన్ సమయంలో లగేజీ లోపలి లైనింగ్లో బంగారం దాచి తరలించేందుకు ప్రయత్నించారు. పలువురు దుస్తులు, చెప్పుల్లో పెట్టి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు.
ఈ మేరకు ముంబయి కస్టమ్స్ అధికారులు సోషల్ మీడియాలో బ్యాగ్ను తనిఖీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ముంబయి కస్టమ్స్ జోన్ 2 ఇటీవల రూ.4.29కోట్ల విలువైన 7.88 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. అలాగే, 16 ఐఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నది. ఫిబ్రవరి 6-7 తేదీల మధ్య కమిషనరేట్ ఐదువేర్వేరు కేసుల్లో భారతీయుల నుంచి రూ.3.49 కోట్ల విలువైన 6.33 కిలోల బంగారాన్ని పట్టుకున్నది. ధరించిన బట్టలు, మొబైల్ ఛార్జర్, పర్సు, హెయిర్ డ్రైయ్యర్, బ్యాగులు, పైపపుల్లో బంగారాన్ని తరలిస్తూ పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు.