Flipkart | ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది ఆన్లైన్ షాపింగ్కే మొగ్గు చూపుతున్నారు. తమకు కావల్సిన వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం ఆర్డర్ చేసిన ఉత్పత్తులు మిస్ప్లేస్మెంట్లు జరుగుతుంటాయి. ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. అదే సమయంలో మనం ఆర్డర్ చేసిన వస్తువులు డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. తాజాగా అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి ఎదురైంది.
ఓ కస్టమర్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (Flipkart) నుంచి కిచెన్ చిమ్నీని (Kitchen Chimney) ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 6వ తేదీన తాను ఆర్డర్ చేసిన ప్రాడక్ట్ డెలివరీ కూడా అయ్యింది. ఎంతో ఉత్సాహంగా ఆ పార్శిల్ను ఓపెన్ చేశాడు. అయితే, అందులో ఉన్న వస్తువును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే.. చిమ్నీ మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది. పార్శిల్ మొత్తం గాజు ముక్కలతో నిండి కనిపించింది. ఇక వెంటనే కస్టమర్ కేర్కు కాల్ చేసి విషయం మొత్తం వివరించాడు. అయితే, రోజులు గడుస్తున్నా సంస్థ ఇప్పటి వరకూ ఎలాంటి రిప్లేస్మెంట్, రీఫండ్ను అందించలేదు. దీంతో విసిగిపోయిన సదరు కస్టమర్ తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. డ్యామేజ్ అయిన చిమ్నీ ఫొటోలు, వీడియోలను ఎక్స్లో పోస్టు చేశాడు. తక్షణమే తన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. దీనిపై ఫ్లిప్కార్ట్ స్పందించింది. ఘటనకు గానూ క్షమాపణలు కోరింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
కాగా, ఇటీవలే ఆర్యన్ అనే ఓ కస్టమర్ రూ.లక్ష విలువ చేసే సోనీ టీవీ ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ చేయగా.. దానికి బదులు థామ్సన్ టీవీ డెలివరీ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అతడు కూడా ఒకింత అసహనానికి గురై.. ఇలానే సోషల్ మీడియా ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నాడు.
Till now no resolution given by Flipkart @Flipkart @flipkartsupport
Damaged product delivered on 6th Oct.
13 days passed.
Please help @jagograhakjago
Please help @GyanTherapy
Please help @AmreliaRuhez pic.twitter.com/XwvBuXq89F— P D (@tomplayjr) October 18, 2023
Also Read..
Viral Video | గాల్లోకి నోట్లు వెదజల్లుతూ.. బాణసంచా కాలుస్తూ రచ్చ.. ముగ్గురు అరెస్ట్