హల్ద్వాని: ఉత్తరాఖండ్లోని హల్ద్వాని సిటీలో కర్ఫ్యూను ఎత్తివేశారు. ఆ సిటీలోని బన్బూల్పురా ప్రాంతంలో అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ మదర్సాను కూల్చివేయడంతో అక్కడ హింస( Uttarakhand’s violence) జరిగింది. అక్రమంగా నిర్మించిన మదర్సాను కోర్టు ఆదేశాల ప్రకారమే కూల్చివేశారు. అయితే కూల్చివేత చేపడుతున్న సమయంలో కొందరు గుంపులుగా వచ్చి ప్రభుత్వ ఉద్యోగులపై అటాక్ చేశారు. ఆ సమయంలో పోలీసులకు, ఆగంతులకు ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఇద్దరు మృతిచెందారు. వంద మందికిపైగా గాయపడ్డారు. దీంతో తక్షణమే అక్కడ కర్ఫ్యూ విధించారు. స్కూళ్లను మూసివేశారు. ఇవాళ షాపులను తెరిచారు. కానీ ఇంకా స్కూళ్లను మూసే ఉంచారు. సిటీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని శాంతిభద్రతల అదనపు డీజీపీ అన్షుమన్ తెలిపారు. ఈ హింసతో లింకున్న అయిదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.