CUET | న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ- యూజీ) ఫలితాలు ఈ నెల 17లోగా విడుదల చేయనున్నట్టు యూజీసీ చైర్పర్సన్ జగదీశ్కుమార్ తెలిపారు. అభ్యర్థులు cuet.samarth.ac.in. వెబ్సైట్లో ఫలితాలను చూడవచ్చని చెప్పారు. మే 21- జూన్ 23 మధ్య మూడు షిఫ్టుల్లో సీయూఈటీ యూజీ పరీక్షను నిర్వహించారు. 14,90,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.