న్యూఢిల్లీ, జూన్ 22: సెంట్రల్ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ-యూజీ) జూలై 15-ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. జూలై 17న నీట్-యూజీ, జూలై 21, ఆగస్టు 3న జేఈఈ మెయిన్ పరీక్షలు ఉన్నందున ఆ మూడు రోజుల్లో సీయూఈటీ పరీక్షలు ఉండవని తెలిపింది. సీయూఈటీకి 11 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రిజిస్ట్రేషన్కు మరో రెండు రోజులు (ఈ నెల 24 వరకు) గడువు ఇస్తున్నట్టు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ) విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.