న్యూఢిల్లీ: రోగకారక బయోమెడికల్ వ్యర్థాలను భూ సారాన్ని పెంచే పదార్థాలుగా మార్చే నూతన విధానాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) అభివృద్ధి చేశాయి.
సీఎస్ఐఆర్ 82వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా భారత మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. మన దేశంలో రోజుకు 770 టన్నులకుపైగా బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు 2020లో అంచనా వేశారు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఈ వ్యర్థాలు అధికంగా పెరిగాయి.