న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీపై నిషేధం, ఆర్బీఐ నుంచి డిజిటల్ కరెన్సీ విడుదలకు సంబంధించిన బిల్లును కేంద్రం ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకురాకపోవచ్చని ఉన్నత స్థాయిలోని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బిల్లు ఎప్పుడు పార్లమెంటుకు వచ్చినా దానిపై సలహాలు, సూచనల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.