ముంబై: షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ నిందితుడిగా ఉన్న ముంబై క్రూయిజ్ షిప్ పార్టీ కేసులో కీలక పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. విచారణ జరిపినా కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అరెస్టుల సంఖ్యా పెరుగుతూనే ఉన్నది. తాజాగా ఇవాళ కూడా ఎన్సీబీ అధికారులు కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదయం అరెస్టయిన నిందితుల్లో అబ్దుల్ ఖదీర్ షేక్, శ్రేయాస్ నాయర్, మనీశ్ దర్యా, అవిన్ సాహూ ఉన్నారు. వారిని ముంబైలోని ఎస్ప్లానడే కోర్టులో హాజరుపర్చగా కోర్టు వారికి ఈ నెల 11 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. కాగా, ఇవాళ అరెస్టయిన నలుగురితో కలిపి ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య 12కు చేరింది.