(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కుల ధ్రువీకరణ పత్రం నకలు కావాలంటూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేశాడు. రికార్డులు లేవని సమాధానం వచ్చింది. ఎందుకు లేవని మళ్లీ పిటిషన్ వేశాడు. ‘మీ ఆర్టీఐ పిటిషన్ తొలి కాపీ కూడా కనిపించట్లేదు’ అంటూ అధికారులు సమాధానమిచ్చారు. బీజేపీపాలిత ఎంపీలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. మధ్యప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో లక్షలాది జనన-మరణ, కుల, ఆదాయ, భూమికి సంబంధించిన పత్రాలు కనిపించట్లేదు.
కోర్టుల్లో భూమికి సంబంధించిన కేసులు పరిష్కారం అయినప్పటికీ, ప్రభుత్వ రికార్డుల్లో వివరాలు కనిపించకపోవడంతో బాధితులకు స్వాంతన లభించట్లేదు. రికార్డుల మిస్సింగ్కు సంబంధించి రాష్ట్రం నలుమూలన నుంచి వేలాది ఆర్టీఐ పిటిషన్లు వెల్లువెత్తుతుండటంతో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ రాహుల్ సింగ్ స్పందించారు. రికార్డుల మిస్సింగ్కు కారణమైన అధికారులను బాధ్యులుగా చేయాలని, సెంటర్స్ పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్స్, 1993 ప్రకారం బాధ్యులకు రూ. 10 వేల జరిమానా లేదా ఐదేండ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించాలని ప్రధాన కార్యదర్శి (జీఏడీ)ని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి 66 ఏైండ్లెనప్పటికీ, రాష్ట్రం స్వతహాగా పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ను రూపొందించుకోకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.