పట్నా: బీహార్లోని గయా జిల్లాలో మావోయిస్టులు మంతుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయడప్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్కు సంబంధించిన కోబ్రా కమాండో దళం మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టింది. ఈక్రమంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ విభోర్ కుమార్ సింగ్ తీవ్రంగా గాపడ్డారు.
పేలుడు ధాటికి ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ పేలుడులో మరో జవాన్కు గాయాలయ్యాయని చెప్పారు. వారిని సమీపంలోని దవాఖాను తరలించామని తెలిపారు. కోబ్రా పెట్రోలింగ్ బృందంపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు.