కేంద్రపార (ఒడిశా): ఒడిశాలోని కేంద్రపార జిల్లాలో అశుతోష్ ఆచార్య(10) అనే బాలుడు బ్రహ్మణి నదిలో గురువారం స్నానం చేస్తుండగా హఠాత్తుగా దాడి చేసిన మొసలి అతడిని నోట చిక్కించుకుని నీటిలోకి వెళ్లిపోయిందని పోలీసులు వెల్లడిం చారు. మొసలి సగం తినేసిన బాలుడి శరీరం లభ్యమైందన్నారు.
బాలుడిని చంపిందన్న కోపంతో గ్రామస్తులు ఒక మొసలిని వల వేసి పట్టుకుని మరీ దారుణంగా కొట్టి చంపిన సంఘటన బీహార్లో జరిగింది. వైశాలీ జిల్లాకు చెందిన ఒక బాలుడు కల్సాఘాట్ వద్ద గంగానదిలో నీటి కోసం దిగగా కుటుంబ సభ్యులందరూ చూస్తుండగానే ఒక మొసలి బాలుడిని చంపి తినేసింది. దీంతో ఆగ్రహించి బాలుడి కుటుంబ సభ్యులు మొసలిని కర్రలతో చితకబాది చంపేశారు.