న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పని చేస్తున్న ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మెహ్రౌలీ ఏరియాలో తాను అద్దెకుంటున్న అపార్టుమెంట్లోని ప్లాట్లో ఆమె ఆదివారం రాత్రి ఈ అఘాయిత్యం చేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
మహిళా కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సదరు మహిళా కానిస్టేబుల్ స్వస్థలం మిజోరాం రాష్ట్రమని, ఢిల్లీలోని కిషన్ గఢ్ పోలీస్స్టేషన్లో ఆమె విధులు నిర్వహిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.