న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను చదువుతూ.. 60 లక్షల ఉద్యోగులు సృష్టించడమే ప్రభుత్వ టార్గెట్ అని ఆమె తెలిపారు. 14 రంగాల్లో పీఎల్ఐ ద్వారా ఆ ఉద్యోగాలను కల్పించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉద్యోగ కల్పనే కాకుండా.. రాబోయే అయిదేళ్లలో 30 లక్షల కోట్ల ఆదాయాన్ని సృష్టించనున్నట్లు ఆమె చెప్పారు. ఇక త్వరలో జీవిత బీమా సంస్థను పబ్లిక్ ఇష్యూకు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన ఉంటుందని ఆమె అన్నారు.