లక్నో: ఒకవైపు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంచించుకుపోతున్నది. పలు ఇళ్లకు పగుళ్లివ్వడంతో ప్రజలను ఖాళీ చేయించారు. మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా పలు ఇళ్లకు పగుళ్లిచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. బాగ్పత్, అలీగఢ్ ప్రాంతాల్లోని ఇళ్ల గోడలు బీటలు వారాయి. బాగ్పత్లోని ఠాకుర్ద్వారా ప్రాంతంలో కొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడినట్లు తమకు తెలిసిందని ఆ జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. వీటిని పరిశీలించాలని రాష్ట్ర విపత్తు నిర్వాహణ సంస్థను కోరినట్లు చెప్పారు.
కాగా, భూమిలోని తాగునీటి పైప్ లైన్ లీకేజీ వల్ల సుమారు 25 ఇళ్ల గోడలు బీటలు వారినట్లు బాగ్పత్ ప్రజలు తెలిపారు. ఇటీవల భూమి లోపల గ్యాస్ పైప్ లైన్ వేశారని, ఈ సందర్భంగా దాని కింద ఉన్న వాటర్ పైప్ లైన్ దెబ్బతిన్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కొన్ని ఇళ్లులో పగుళ్లు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఇవి అంతకంతకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు అలీగఢ్లోని కన్వారీ గంజ్లో గత ఐదు రోజులుగా సుమారు పాతిక ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా పైపులైన్లు వేస్తున్నారని, నాసిరకంగా పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొండ వాలుపై ఉన్న ప్రాంతంలోని ఇళ్లు పగుళ్లిస్తున్నట్లు వాపోయారు. అయితే ఇళ్ల పగుళ్లను పరిశీలించామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని స్థానిక సివిల్ అధికారి తెలిపారు.
Uttar Pradesh | Locals say a few houses in Baghpat's Thakurdwara area have developed cracks
We have received information that 4-5 houses have developed cracks. SDM has been asked to reach the spot. We will find a solution soon: ADM Baghpat pic.twitter.com/exNOzWqdSA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 12, 2023