కోజికోడ్, అక్టోబర్ 12: సీపీఎం మిత్రపక్షమైన లోక్తాంత్రిక్ జనతాదళ్(ఎల్జేడీ) గురువారం లాలూప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలో విలీనమైంది. ఆర్జేడీ నాయకుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సమక్షంలో ఒక తీర్మానం ఆమోదించడం ద్వారా ఈ విలీనం జరిగింది.
ఈ విలీనం తమ పార్టీని దక్షిణాదిలో బలోపేతం చేస్తుందని.. దేశవ్యాప్తంగా ఉన్న సామ్యవాద వర్గాలకు బలమైన సందేశాన్ని ఇస్తుందని తేజస్వి యాదవ్ అన్నారు.