న్యూఢిల్లీ, మే19 (నమస్తే, తెలంగాణ): రెజ్లర్ల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వీడాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన శుక్రవారం 27వ రోజుకు చేరుకోగా శిబిరాన్ని సందర్శించిన నారాయణ, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. మహిళా క్రీడాకారులకు న్యాయం జరిగే వరకు తమ మద్దతు ఉంటుందని నేతలు పేర్కొన్నారు. నారాయణ వెంట వివిధ ప్రజా సంఘాల నేతలు ఉన్నారు.