రాంచీ, జూన్ 19: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని లౌకిక, ప్రజాస్వామిక పార్టీలు ఏకం అవుతున్నాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా అన్నారు. సోమవారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, బీజేపీని కూకటివేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు.
విపక్షాలు ఏకమయ్యే కార్యక్రమం వేగం పుంజుకొన్నదని అన్నారు. ఈనెల 23న బీహార్లోని పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగనున్నదని తెలిపారు.