న్యూఢిల్లీ, జూన్ 22 : గోమూత్రంతో చికున్ గున్యాకు చెక్ పెట్టవచ్చని ఐఐటీ రూర్కీ పరిశోధకులు గుర్తించారు. ఈ సహజసిద్ధమైన తయారీ ప్రయోగశాలలో చికున్గున్యా వైరస్కు వ్యతిరేకంగా బలమైన యాంటీవైరల్ చర్యను కనబరిచినట్లు పరిశోధనా బృందం పేర్కొన్నది.
ఆధునిక పరిశోధన పద్ధతులను ఉపయోగించి సంప్రదాయ నివారణలను అధ్యయనం చేయడంపై పెరుగుతున్న శాస్త్రీయ ఆసక్తికి ఈ ఫలితాలు మరింత బలాన్ని చేకూరుస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఐఐటీ రూర్కీలోని బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ షైలీ తోమర్, ఆమె బృందం ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.