శాస్త్రవేత్తలు కూడా ఇదే నమ్ముతున్నారు: అలహాబాద్ హైకోర్టు జడ్జి
అలహాబాద్, సెప్టెంబర్ 3: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచిస్తూ ఇటీవల వార్తల్లో నిలిచిన అలహాబాద్ హైకోర్టు తాజాగా మరో కీలక వ్యాఖ్య చేసింది. ఆక్సిజన్ను పీల్చుకొని, వదిలేసే ఏకైక జంతువు గోవేనని, ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం విశ్వసిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడను కలిపి తయారుచేసే ‘పంచగవ్య’ మిశ్రమంతో.. నయంకాని రోగాలను కూడా తగ్గించవచ్చన్నారు. హిందూ పురాణాల ప్రకారం.. 33 వర్గాలకు చెందిన దేవాదిదేవతలు గోవునే ఆవాసంగా చేసుకొని కొలువై ఉన్నారని గుర్తుచేశారు. ఆవుల కాళ్ల మధ్యనే తిరుగుతూ.. చిన్ని కృష్ణుడు అపూర్వ మేథస్సును సంపాదించాడని పేర్కొన్నారు. గో హత్య మనిషి హత్యతో సమానమని క్రీస్తు బోధించినట్టు వెల్లడించారు.