న్యూఢిల్లీ: కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇక నుంచి మార్కెట్ చేసుకునేందుకు డ్రగ్స్ కంట్రోలర్ సంస్థ అనుమతి ఇచ్చింది. కోవిడ్ నివారణ కోసం ఈ రెండు టీకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. పూణెకు చెందిన సీరం సంస్థ కోవీషీల్డ్, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాలు ఇవ్వడం ప్రారంభించిన తర్వాత.. ఈ రెండు టీకాలనే ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డీసీజీఐ మార్కెటింగ్కు అనుమతి ఇచ్చినా.. ఇప్పుడే ఈ టీకాలు షాపుల్లో అందుబాటులోకి రావు. అయితే హాస్పిటళ్లు, క్లినిక్ల నుంచి ఈ టీకాలను కొనుగోలు చేయవచ్చు. అయితే కండీషనల్ మార్కెటింగ్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.