న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి గత రెండు మూడు రోజుల నుంచి కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభించింది. గడిచిన 24 గంటల్లో భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 12,193 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.
ఇదిలావుంటే గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,765 మంది కరోనా బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దాంతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 14 వందల పై చిలుకు పెరగి 67,556కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి మరింత విస్తరించకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.