న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 69.51 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లను ( Covid Vaccines ) సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. మరో 77,93,360 వ్యాక్సిన్ డోసులు మార్గమధ్యంలో ఉన్నాయని, త్వరలో అవి కూడా రాష్ట్రాలకు చేరుకుంటాయని ఆరోగ్యశాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 5.31 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.
ఇప్పటివరకు మొత్తం 69,51,79,965 వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమకూర్చాం. మరో 77,93,360 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 5,31,15,610 వినియోగించని వ్యాక్సిన్ డోసులు ఉన్నాయి అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తన ప్రటకనలో పేర్కొన్నది. జాతీయస్థాయి వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నది.