న్యూఢిల్లీ, మార్చి 14: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. 12-14 ఏండ్ల పిల్లలకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం నుంచి 12-14 ఏండ్లవారికి వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతుందన్నారు. హైదరాబాద్కు చెందిన ఫార్మా సంస్థ ‘బయాలాజికల్ ఈ’ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు వేయనున్నారు. 12-14 ఏండ్ల వయసున్న పిల్లలు దేశంలో 7.11 కోట్ల మంది ఉంటారని అంచనా. బయాలాజికల్ ఈ ఇప్పటికే 5 కోట్ల కార్బివాక్స్ డోసులను కేంద్రానికి సరఫరా చేసింది. వాటిని ఇప్పటికే రాష్ర్టాలకు పంపిణీ చేశారు. దీంతో పాటు 60 ఏండ్లు పైబడిన వారందరూ ముందుజాగ్రత్త డోసు(ప్రికాషన్) వేసుకోవడానికి కేంద్రం అనుమతించింది. కోమార్బిడిటీ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం హెల్త్కేర్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికే ముందు జాగ్రత్త డోసు వేస్తున్నారు.