మళ్లీ విధుల్లోకి తీసుకోని కంపెనీలు
పడిపోతున్న మహిళా భాగస్వామ్యం
దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం
న్యూఢిల్లీ, జూన్ 2: కరోనా మహమ్మారి దేశంలోని మహిళా ఉద్యోగులపై పెను ప్రభావం చూపిందని బ్లూమ్బర్గ్ ఎకనమిక్స్ నివేదిక తెలిపింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన మహిళలను అనేక కంపెనీలు మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవడం లేదని పేర్కొన్నది. దీంతో పనిచేస్తున్న మహిళల సంఖ్య 26% నుంచి 19%కి పడిపోయినట్టు వెల్లడించింది. ఉద్యోగాల పరంగా స్రీ, పురుషుల మధ్య అంతరం పెరుగుతున్నదని హెచ్చరించింది. ఈ అంతరం 2050 నాటికి 58 బేసిస్ పాయింట్లు ఉండొచ్చని తెలిపింది. దీని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు 480 లక్షల కోట్ల రూపాయల నష్టం కలుగవచ్చని అంచనా వేసింది.
కరోనాకు ముందు పనిచేసే మహిళల శాతం- 26
ప్రస్తుతం దేశంలో పనిచేసే మహిళల శాతం- 19
2050నాటికి స్త్రీ, పురుషుల మధ్య అంతరం- 58 బేసిస్ పాయింట్లు.
మహిళలు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల
2050 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం-రూ.480 లక్షల కోట్లు.
దేశ జనాభాల్లో స్త్రీలు 48%.. జీడీపీలో స్త్రీల వాటా-17%
చైనా జీడీపీలో స్త్రీల వాటా-40%