న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 173.86కోట్ల డోసులు వేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 41,54,476 వేశామని పేర్కొంది. ఇప్పటి వరకు 1,95,98,966 సెషన్లలో 1,73,86,81,675 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.
థర్డ్వేవ్ నేపథ్యంలో 1,79,73,749 డోసుల ప్రికాషనరీ డోసు వేసినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశంలో నిన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు తాజా స్వల్పంగా పెరిగాయి. 30,615 కొత్త కేసులు రికార్డవగా.. పాజిటివిటీ రేటు 2.45శాతానికి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,70,240 ఉన్నాయని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.