Covid-19 | దేశంలో కొవిడ్, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అయ్యింది. ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ఈ మాక్డ్రిల్లో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను పాల్గొంటాయని పేర్కొంది. ఈ నెల 27న జరిగే వర్చువల్ మీటింగ్లో మాక్ డ్రిల్కు సంబంధించి ఖచ్చితమైన వివరాలను రాష్ట్రాలకు తెలుపుతామని అడ్వైజరీలో తెలిపింది.
దేశంలోని అత్యధిక కరోనా కేసులు కేరళ (26.4 శాతం), మహారాష్ట్ర (21.7 శాతం), గుజరాత్ (13.9 శాతం), కర్ణాటక (8.6 శాతం), తమిళనాడు ( 6.3 శాతం) పెరుగుతున్నట్లు కేంద్రం ఆరోగ్యమంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ శనివారం జారీ చేసిన అడ్వైజరీలో పేర్కొంది. గత కొన్ని వారాల్లో కొన్ని రాష్ట్రాల్లో COVID-19 పరీక్షలు తగ్గినట్లు పేర్కొంది. రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులను ఎదుర్కోవడానికి సంసిద్ధతను అంచనా వేయడానికి మాక్డ్రిల్లో పాలు పంచుకోవాలని కేంద్రం కేరింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో నిర్వహించే మాక్ డ్రిల్లో ఐసీయూ బెడ్లు, వైద్య పరికరాలు, ఆక్సిజన్, సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడనున్నట్లు పేర్కొంది.
మరో వైపు ప్రజలు కొవిడ్ ప్రోటోకాల్స్ను అనుసరించాలని కోరింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లే సమయంలో మాస్క్లు ధరించాలని సూచించింది. తరుచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నివారించాలని సూచించారు. దేశంలో 146 రోజుల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. శనివారం దేశంలో 1,590 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో 8,601కు యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. క్రమంలో ప్రస్తుతం దేశంలో ఇన్ఫ్లుఎంజా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజనల్ వ్యాధులతో పాటు కొవిడ్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.