కరోనా టీకాను పిల్లలకు కూడా అందుబాటులోకి తీసుకురావడంలో కీలక ముందడుగు పడింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను 2-18 ఏండ్ల వయసు వారిపై రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది. మరోవైపు, భారత్ బయోటెక్ సంస్థలో పనిచేస్తున్న 50 మంది ఉద్యోగులు కరోనాబారిన పడ్డారు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ సుచిత్రా ఎల్లా వెల్లడించారు.