బెంగళూరు, మార్చి 30: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యెడియూరప్పపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 2006-07లో కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన యెడియూరప్ప కొంతమందికి ప్రయోజనం చేకూరేలా భూ కేటాయింపులు జరిపారని పేర్కొంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పైవిధంగా ఆదేశించింది.