తిరువల్లూర్: ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువ అవడంతో దాన్ని కొనుగోలు చేసిన వినియోగదారుడికి ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ ఐటీసీ రూ.లక్ష చెల్లించనున్నది. ఈ మేరకు తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లా వినియోగదారుల ఫోరం జరిమానా విధించింది. చెన్నై కు చెందిన దిలీప్బాబు తాను కొన్న ప్యాకెట్లో ఒక బిస్కెట్ తక్కువ ఉండటంతో ఐటీసీపై రూ.100 కోట్ల జరిమానా, తనకు రూ.10 కోట్ల పరిహారం ఇప్పించాలని కోరుతూ కేసు వేశారు. కంపెనీ వాదనలను తోసిపుచ్చిన వినియోగదారుల ఫోరం లేబుల్పై పేర్కొన్న విధంగా 16కు బదులు 15 బిస్కెట్లు ఉండటం సేవా లోపమేనని తేల్చిచెప్పింది.