Couple Thrashed | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తమ ఇంటి ముందు కారు పార్క్ చేశారని (Parking Car) దంపతులపై పొరుగింటి వ్యక్తులు (Neighbours) దాడి చేశారు (Couple Thrashed). బాధిత వ్యక్తిని పదేపదే చెప్పుతో కొడుతూ.. నేలకేసి కొట్టి, పిడుగుద్దుల వర్షం కురిపించారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. బెళగావికి చెందిన దంపతులు రోహిణి, సహిష్ణు ఇటీవలే బెంగళూరులోని దొడ్డనేకుండి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో అపార్ట్మెంట్ వద్ద పొరిగింటి ముందు ఖాళీగా ఉన్న పబ్లిక్ ప్లేస్లో కారు పార్క్ చేశారు. అదే గొడవకు కారణమైంది. అనంతమూర్తి, ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ పార్క్ చేసిన కారును చూపిస్తూ బాధితుడు సహిష్ణుపై దాడి చేశారు. సహిష్ణుపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కింద పడేసి కొడుతూ కనిపించారు. వీడియోలో బాధితుడి భార్య రోహిణి కూడా కనిపించింది. ఆమె ఈ మొత్తం ఘటనను వీడియో తీస్తూ సాయం కోసం ఇరుగుపొరుగు వారిని పిలుస్తూ కనిపించింది. అయితే, ఆమెపై కూడా భాగ్యలక్ష్మి అనే మహిళ దాడి చేయబోయింది. చెప్పుతో రోహిణిని వెంబడించింది.
ఇరుగుపొరుగు వారు కూడా ఈ ఘటనను వీడియో తీశారు. బాధితులు ఒక రోజు క్రితమే ఆ ప్రాంతంలోని అపార్ట్మెంట్లోకి మారినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. 354, 324, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.
#Bengaluru: Rohini and Sahishnu a couple from Belagavi Karnataka were subjected to brutal assault in Bengaluru’s Doddanekundi area over minor issue of Parking on Sunday night around 10.30pm.
Three booked for the assault Ananthmurthy and Prashanth. One woman Bhagyalaksmi is… pic.twitter.com/eJ0hUSsGS2
— Saba Khan (@ItsKhan_Saba) March 19, 2024
Also Read..
EVA Air flight | లండన్ వెళ్లే విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Gadchiroli Encounter: ప్రాణహిత నది దాటి వెళ్లి.. సీ-60 దళాలకు చిక్కిన నక్సల్స్
IT Raids | చట్నీస్ హోటల్స్పై ఐటీ దాడులు.. యజమాని ఇండ్లలోనూ సోదాలు