వాళ్లు ఆన్లైన్లోనే పరిచయం అయ్యారు. ఇప్పుడు పెళ్లి కూడా ఆన్లైన్లోనే చేసుకుంటున్నారు. అవును.. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ నడుస్తోంది కదా. ఈనేపథ్యంలో బెంగాల్కు చెందిన ఓ జంట ఆన్లైన్లోనే పెళ్లి చేసుకోంటోంది. వాళ్లే సందీపన్ సర్కార్, అదితి దాస్. జనవరి 24న వీళ్లిద్దరూ ఆన్లైన్లో పెళ్లి చేసుకోబోతున్నారు.
వెస్ట్ బెంగాల్లోని బుర్ద్వాన్ జిల్లాకు చెందిన ఈ జంట ఆన్లైన్లో పెళ్లి చేసుకోబోతోంది. కరోనా వల్ల ఎక్కువ మంది గెస్ట్లు అటెండ్ కాలేని నేపథ్యంలో అందరు అతిథులకు గూగుల్ మీట్ ద్వారా అటెండ్ కావాలంటూ లింక్ పంపించారు. ఆ లింక్ ద్వారా పెళ్లి రోజున అతిథులు ఆన్లైన్లో పెళ్లికి అటెండ్ కాబోతున్నారు. దాదాపు 350 మంది గెస్టులకు గూగుల్ మీట్ ద్వారా ఆహ్వానించింది ఆ జంట.
వాళ్ల పెళ్లికి కేవలం దగ్గరి బంధువులు మాత్రమే హాజరు అవనున్నారు. మిగితా బంధువులు అందరూ గూగుల్ మీట్ ద్వారా అటెండ్ కానున్నారు. ఆన్లైన్లో అటెండ్ అయ్యే అతిథులకు జొమాటో ద్వారా మంచి పెళ్లి విందును వాళ్ల ఇంటికే పంపించనుంది కాబోయే పెళ్లి జంట.
ఇక.. పెళ్లికి హాజరు కాని వాళ్లు.. ఏవైనా గిఫ్ట్లు పంపించాలనుకుంటే.. గూగుల్పే లేదా ఫ్లిప్కార్టు గిఫ్ట్ కార్డ్స్ పంపించే వెసులుబాటును కూడా ఈ జంట కల్పించింది.
నాకు ఈ మధ్యే కరోనా వచ్చింది. కరోనా నుంచి కోలుకున్నాను. కానీ.. నాలాంటి పరిస్థితి ఇతరులకు రావద్దని.. ఈ నిర్ణయం తీసుకున్నా. పెళ్లికి వచ్చేవాళ్లకు కరోనా సోకితే లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే ఆన్లైన్లో పెళ్లి జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం.. అని కాబోయే పెళ్లికొడుకు సందీపన్ చెప్పుకొచ్చాడు.