ముంబై, జూన్ 26: తాను ముంబైలో ఉన్న బార్ల యజమానుల నుంచి రూ.4.7 కోట్లు వసూలు చేశానని అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు ఒప్పుకొన్నారు. ఆ డబ్బును మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వ్యక్తిగత సహాయకుడికి ఇచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు ఈడీ శనివారం వివరాలను వెల్లడించింది. తనకు అనేక కేసుల దర్యాప్తుల్లో హోంమంత్రి నుంచే నేరుగా ఆదేశాలు వచ్చేవని వాజే చెప్పారు. ఇదిలా ఉండగా, విచారణకు హాజరుకావాల్సిందిగా అనిల్ దేశ్ముఖ్కు ఈడీ మరోసారి సమన్లు జారీచేసింది.