న్యూఢిల్లీ, మే 18: సింగపూర్లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూసిందని, ఇది పిల్లలకు ప్రమాదకరమని తెలుస్తున్నదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఇది భారత్కు ప్రవేశిస్తే థర్డ్వేవ్కు కారణమయ్యే ప్రమాదం ఉందన్నారు. సింగపూర్ నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పిల్లలకు వ్యాక్సిన్ ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరారు.