మిస్ వరల్డ్ పోటీలు వాయిదా
ముంబై, డిసెంబర్ 17: ప్రపంచ సుందరి-2021 అందాల పోటీలపై కొవిడ్ కోరలు చాచింది. ఈ పోటీల్లో భారత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ సుందరి, మిస్ ఇండియా మానస వారణాసి సహా 17 మంది పోటీదారులు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ పోటీలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. వాస్తవానికి ఈ పోటీలు ప్యూర్టోరికోలోని శాన్ జువాన్లో గురువారం (డిసెంబర్ 16) నుంచే ప్రారంభం కావాల్సి ఉన్నది. పోటీదారులకు కరోనా సోకడంతో 90 రోజుల అనంతరం ఈ పోటీలను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. 24 ఏండ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా-2020 పోటీల్లో విజేతగా నిలిచి.. 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించారు. ఈ సుందరి ఎఫ్ఐఐటీ జేఈఈలో ఇంటర్మీడియెట్, వాసవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివారు.