న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ ( corona third wave )పై హెచ్చరికలు జారీ చేశారు ప్రముఖ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్. పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోతే అసలు మూడో వేవ్లో ఎన్నిక కేసులు వస్తాయో ఊహించడం కూడా కష్టమేనని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ నిటారు పర్వతమైతే.. మూడో వేవ్ ఓ పెద్ద కొండ అని ఆమె అభిప్రాయపడ్డారు. అసలు థర్డ్ వేవ్లో ఎన్ని కేసులు వస్తాయో ఎవరూ ఊహించలేరని ఆమె చెప్పడం గమనార్హం. వైరస్ ఇలాగే మ్యుటేట్ అవుతూ, మరింత ప్రమాదకరంగా మారుతుంటే కేసుల సంఖ్య అంచనా వేయడం కష్టమని గగన్దీప్ కాంగ్ అన్నారు.
ఇక కేరళలో కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వ వైఫల్యమా అని ప్రశ్నించగా.. కాదని సమాధానమిచ్చారు. అయితే నెమ్మదిగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్, తగిన యాంటీబాడీలు లేకపోవడం కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందన్న వాదనను ఆమె అంగీకరించారు.