యూపీలో ఘటన
బలరామ్పూర్: ఉత్తరప్రదేశ్, బీహార్లలో గంగా, యమునా నదుల్లో వందలాది కరోనా బాధితుల మృతదేహాలు బయటపడిన ఘటనను మరువకముందే మరో విస్మయకర ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని బలరామ్పూర్లో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని నదిలోకి కొందరు విసిరేస్తున్న వీడియో కలకలం రేపింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. అది కొవిడ్ మృతదేహమేనని అధికారులు ధ్రువీకరించారు. మృతుడి బంధువులే నదిలో పడవేశారని చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు తెలిపారు.