సిమ్లా: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మే 6 తేదీ (గురువారం) రాత్రి నుంచి మే 16వ తేదీ ఉదయం వరకు 10 రోజులపాటు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ కర్ఫ్యూ వేళల్లో అన్ని రంగాలకు సంబంధించిన కార్యాలయాలు మూసే ఉంటాయని, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అనుమతించబడుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
కర్ఫ్యూ కొనసాగినన్ని రోజులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు లేకుండా ఎవరు బయట కనబడినా కఠిన చర్యలు తీసుకుంటామని హిమాచల్ ప్రదేశ్ సర్కారు హెచ్చరించింది. అదేవిధంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించి కూడా సర్కారు కీలక నిర్ణయం చేసింది. ఈ ఏడాదికి పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని, విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నామని తెలిపింది.