భారత దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గలేదు. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 5,784 కొత్త కేసులు నమోదయ్యాయి. 7,995 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే మరో 252 మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,75, 888కు చేరింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 88,893 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు మొత్తం 133.8 కోట్ల మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్లో వెల్లడించింది.