అహ్మదాబాద్: గుజరాత్లోని (Gujarat) వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున వల్సాద్లోని జాతీయ రహదారి 48పై ఓ కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న షాపోలు, పర్ఫ్యూమ్ బాటిళ్లు పేలిపోయాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో కంటైనర్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెంగు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని ఫైర్ ఆఫీసర్ దివ్యేశ్ పటేల్ వెల్లడించారు. షాంపూలో, సెంట్ బాటిళ్లతో కూడిన కంటైనర్ ముంబై నుంచి అహ్మదాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. లారీలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసునమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH Gujarat: A container caught fire on NH48 near Motiwada village in Valsad. 5 fire tenders reached the spot. pic.twitter.com/5fuI9sg7TB
— ANI (@ANI) September 30, 2022